'చందాలిచ్చే వారినే అందలమెక్కించే' ధనదాసులను దారిమళ్ళించి,
పేదరికపు కారుమేఘాలు కమ్మిన జీవితాలలో విద్యా శరశ్చంద్రికలు చిందించి,
ప్రతిభకు ప్రాముఖ్యతనిచ్చే ప్రవేశ పరీక్షలు వచ్చేశాయనీ..
చదువుల తల్లిని కూడా భాగ్యవంతుని బానిసగా భావించే రోజులు గతించి,
ప్రతిభావంతునికి ప్రపంచమంతా ప్రణమిల్లే రోజులు ఏతెంచాయనీ..
భావిభారత భాగ్య మందిరానికి అదే పునాది అనీ..
భావించిన భరతమాత ఆనాడు ఆనంద డోలికలలో అలరారింది.
కానీ...
ఏ ఎంట్రన్స్ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?
పరీక్షల పధ్ధతి సమస్తం అవినీతి పరాయణత్వం" అనిపించే రీతిలో
జవాబులు తప్పు రాసే విధ్యార్ధులకు పోటీగా
అధికారులు అందించే అనర్ధ స్వకపోల కల్పనాభరిత ప్రశ్నాపత్రాల వల్ల
విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమై నిలుస్తుంటే ...
అన్నిటా ఆరునెలల ఆలస్యాన్ని అవలంబించే అధికారపుంగవులు
ప్రశ్నా పత్రాలను మాత్రం పాపిష్ఠిసొమ్ము కోసం పది రోజుల ముందే పరగతం చేసి,
చిత్తశుధ్ధితో చదివే చిన్నారుల ఆశలను చిదిమి వేస్తుంటే..
అమాయక విధ్యార్ధుల ఆశయాల ఆసరాలను అవినీతిపరులు అంతమొందిస్తుంటే..,
భావిభారత సుందర సౌధానికి బంగారు బాటలు వేసే విద్యార్ధుల
పసిడికలల ప్రాకారాలన్నీ పేకమేడలలా కూలిపోతుంటే..
పాపపంకిల పూరిత ప్రవేశ పరీక్షల ఊబిలో చిక్కుకొని ,
అన్యాయంగా అధోగతికి నెట్టబడిన అమాయకులు విడిచే అశృవుల సుడిగుండాలలో పడి
నేడు భరతమాత మునిగిపోనున్నది.
అందుకే ..
ఏనాడు జాతిహితయుక్త ప్రవేశ పరీక్షలలో చెడుగుని చెరగివేయగలమో..,
ఏనాడు కాగితంపులులవంటి నామమాత్ర ప్రవేశ పరీక్షలు
భీకరబొబ్బులులై అన్యాయాన్ని, అసమర్ధతను అణచివేసి ప్రతిభకు పట్టం కట్టగలవో,
ఏనాడు విద్యావంతులు అవినీతిపరులపై విప్లవశంఖం పూరించి విజయపథం లో పయనించగలరో..,
ఆనాడు ..
ఎటు చూసినా ఉండే ఎంట్రన్స్ ల సంరంభం
విద్యార్ధుల భావిజీవితానికి శుభారంభం
అదే..
భరతవర్ష బంగారు భవితకు
హర్ష భరిత శుభారంభం.
పేదరికపు కారుమేఘాలు కమ్మిన జీవితాలలో విద్యా శరశ్చంద్రికలు చిందించి,
ప్రతిభకు ప్రాముఖ్యతనిచ్చే ప్రవేశ పరీక్షలు వచ్చేశాయనీ..
చదువుల తల్లిని కూడా భాగ్యవంతుని బానిసగా భావించే రోజులు గతించి,
ప్రతిభావంతునికి ప్రపంచమంతా ప్రణమిల్లే రోజులు ఏతెంచాయనీ..
భావిభారత భాగ్య మందిరానికి అదే పునాది అనీ..
భావించిన భరతమాత ఆనాడు ఆనంద డోలికలలో అలరారింది.
కానీ...
ఏ ఎంట్రన్స్ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?
పరీక్షల పధ్ధతి సమస్తం అవినీతి పరాయణత్వం" అనిపించే రీతిలో
జవాబులు తప్పు రాసే విధ్యార్ధులకు పోటీగా
అధికారులు అందించే అనర్ధ స్వకపోల కల్పనాభరిత ప్రశ్నాపత్రాల వల్ల
విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమై నిలుస్తుంటే ...
అన్నిటా ఆరునెలల ఆలస్యాన్ని అవలంబించే అధికారపుంగవులు
ప్రశ్నా పత్రాలను మాత్రం పాపిష్ఠిసొమ్ము కోసం పది రోజుల ముందే పరగతం చేసి,
చిత్తశుధ్ధితో చదివే చిన్నారుల ఆశలను చిదిమి వేస్తుంటే..
అమాయక విధ్యార్ధుల ఆశయాల ఆసరాలను అవినీతిపరులు అంతమొందిస్తుంటే..,
భావిభారత సుందర సౌధానికి బంగారు బాటలు వేసే విద్యార్ధుల
పసిడికలల ప్రాకారాలన్నీ పేకమేడలలా కూలిపోతుంటే..
పాపపంకిల పూరిత ప్రవేశ పరీక్షల ఊబిలో చిక్కుకొని ,
అన్యాయంగా అధోగతికి నెట్టబడిన అమాయకులు విడిచే అశృవుల సుడిగుండాలలో పడి
నేడు భరతమాత మునిగిపోనున్నది.
అందుకే ..
ఏనాడు జాతిహితయుక్త ప్రవేశ పరీక్షలలో చెడుగుని చెరగివేయగలమో..,
ఏనాడు కాగితంపులులవంటి నామమాత్ర ప్రవేశ పరీక్షలు
భీకరబొబ్బులులై అన్యాయాన్ని, అసమర్ధతను అణచివేసి ప్రతిభకు పట్టం కట్టగలవో,
ఏనాడు విద్యావంతులు అవినీతిపరులపై విప్లవశంఖం పూరించి విజయపథం లో పయనించగలరో..,
ఆనాడు ..
ఎటు చూసినా ఉండే ఎంట్రన్స్ ల సంరంభం
విద్యార్ధుల భావిజీవితానికి శుభారంభం
అదే..
భరతవర్ష బంగారు భవితకు
హర్ష భరిత శుభారంభం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి